ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మీ - చదువులో సరస్వతి, ఆదరించడంలో అన్నపూర్ణాదేవి అని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ అన్నారు. మండల కేంద్రమైన పాములపాడులోని, ఎంపీయూపీఎస్ ఉర్దూ పాఠశాలలో బిజెపి ఆధ్వర్యంలో "జాతీయ బాలికా దినోత్సవం" ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాయపాటి మురళీ మోహన్, హెచ్ఎం బద్రునిసా బేగం, ఉపాధ్యాయులు ఎస్.నిజాముద్దీన్, తదితర టీచర్లతో కలిసి ఉర్దూ పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఆకర్షణీయమైన బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, ఎంపీయుపి ఉర్దూ స్కూల్ హెచ్ఎం బద్రునిసా బేగం, ఉపాధ్యాయులు ఎస్.నిజాముద్దీన్, తదితర ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో బాలికల సంరక్షణపై అవగాహన కల్పించడానికి బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల, అంశాలపై అవగాహన కల్పించడానికి 2008 నుంచి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలపై ఇప్పటికి వివక్ష ఉందన్నారు. వారిని చదువులో, ఉద్యోగంలో, పెళ్లిలో వెనక్కి లాగే వారు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా, లింగ వివక్ష, బాల్య వివాహాలు వంటి సమస్యలను పరిష్కరించడానికి, బాలికలకు అవసరమైన మద్దతు ఇవ్వడం ఈ రోజుని జరుపుకునే ప్రధాన ఉద్దేశ్యం. కుటుంబాలు, సమాజం, దేశాన్ని నిర్మించడంలో ఆడపిల్లలు ముఖ్యమన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాల గోపాల కృష్ణ, షర్ఫుద్దీన్ పాల్గొన్నారు.
Admin
E Nivas News