Friday, 17 April 2026 05:09:57 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ఆడపిల్లలు చదువులో సరస్వతి

బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్

Date : 24 January 2026 08:59 PM Views : 107

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మీ - చదువులో సరస్వతి, ఆదరించడంలో అన్నపూర్ణాదేవి అని బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ అన్నారు. మండల కేంద్రమైన పాములపాడులోని, ఎంపీయూపీఎస్ ఉర్దూ పాఠశాలలో బిజెపి ఆధ్వర్యంలో "జాతీయ బాలికా దినోత్సవం" ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాయపాటి మురళీ మోహన్, హెచ్ఎం బద్రునిసా బేగం, ఉపాధ్యాయులు ఎస్.నిజాముద్దీన్, తదితర టీచర్లతో కలిసి ఉర్దూ పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఆకర్షణీయమైన బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, ఎంపీయుపి ఉర్దూ స్కూల్ హెచ్ఎం బద్రునిసా బేగం, ఉపాధ్యాయులు ఎస్.నిజాముద్దీన్, తదితర ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో బాలికల సంరక్షణపై అవగాహన కల్పించడానికి బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల, అంశాలపై అవగాహన కల్పించడానికి 2008 నుంచి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలపై ఇప్పటికి వివక్ష ఉందన్నారు. వారిని చదువులో, ఉద్యోగంలో, పెళ్లిలో వెనక్కి లాగే వారు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా, లింగ వివక్ష, బాల్య వివాహాలు వంటి సమస్యలను పరిష్కరించడానికి, బాలికలకు అవసరమైన మద్దతు ఇవ్వడం ఈ రోజుని జరుపుకునే ప్రధాన ఉద్దేశ్యం. కుటుంబాలు, సమాజం, దేశాన్ని నిర్మించడంలో ఆడపిల్లలు ముఖ్యమన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాల గోపాల కృష్ణ, షర్ఫుద్దీన్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :