Friday, 17 April 2026 05:03:41 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు

నాగమధు యాదవ్ ( ఎన్ ఎస్ యు ఐ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు), ఏపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు

Date : 30 December 2025 10:07 AM Views : 345

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అక్రమ పద్ధతులతో, దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరులోని, స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు & యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు లు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు లు మండిపడ్డారు. వెంటనే ఈ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజల పొట్టకొట్టేలా బీజేపీ నిర్ణయాలు ఉంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా, దొంగ ఓట్లను అడ్డం పెట్టుకుని బీజేపీ అధికారంలోకి వచ్చిందని నాగ మధు యాదవ్ విమర్శించారు. నేడు దేశం ఇంతలా అభివృద్ధి చెందిందన్నా, ప్రపంచ దేశాల ముందు భారత్ తలెత్తుకు నిలబడిందన్నా అది కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పాత్రను, దేశానికి దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గరీబీ హటావో నినాదంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన అందించిన సేవలను ఆయన కొనియాడారు. ఇందిరాగాంధీ తెచ్చిన స్వాతంత్ర్యం వల్లే నేడు అందరూ స్వేచ్ఛగా ఉన్నారని, అటువంటి నాయకుల కష్టాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే దేశ ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్తారని పాండిచ్చేరి ఇంచార్జి నాగ మధు యాదవ్, ఏపీసిసి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు లు హెచ్చరించారు. అనంతరం వీళ్ళ సమక్షంలో కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ మెడలో కాంగ్రెస్ పార్టీ కండువవేసి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నాయకులు, శ్రీశైలం నియోజకవర్గం నాయకులు, నందికొట్కూరు నియోజవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :