Friday, 31 July 2026 06:19:58 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పాలక ప్రభుత్వాలు

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి.రమేష్ కుమార్

Date : 27 January 2026 10:54 PM Views : 155

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల కేంద్రంలో ఉన్న నెమలి వెంకట్ రెడ్డి భవన్ సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ సమావేశం టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి- టి.రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ పేద మధ్యతరగతి ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తుందని బిజెపి సిద్ధాంతాలను ప్రోత్సాహంచేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయాలని విద్యుత్ కూడా ప్రైవేట్ రంగానికి అప్పజెప్పేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలపై పన్నుల బరాలు మోపుతూ పెత్తనం చెలాయిస్తుందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, వికసిత్ భారత్ జిరాంజీ పార్లమెంట్లో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం నిధుల వాటాను 90 శాతం ఉన్న వాటను 60% కుదించి రాష్ట్రాల వాటా 10 శాతం ఉంటే, 40 శాతానికి పెంచి నిర్వీర్యం చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద రైతులకు ఇతర వృత్తిదారులకు వ్యవసాయ కూలీలకు ఈ చట్టం వరం లాంటిదని ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని అలాంటి చట్టాన్ని పేరు మార్పు చేసి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. మహిళలకు సమాన పని సమాన వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలోగ్గి కొత్త చట్టాలు అమలు పేరుతో విత్తన చట్టాన్ని విదేశీ కంపెనీల చేతులలో పెడుతూ ఈ దేశ రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. లేబర్ కోడ్ పేరుతో 29 రకాల కార్మిక హక్కుల చట్టాలను నాశనం చేస్తు కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. దేశంలో పరిస్థితులను చూస్తుంటే ప్రశ్నించే వారిని అణచివేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు ధారాధత్వం చేయడం లాంటి చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒడిగట్టడం దుర్మార్గమన్నారు. దేశంలో రెండే ఐడియాలజీలు ఉన్నాయని ఒకటి పెట్టుబడి విధానం కాగా మరొకటి సోషలిజం అని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థను కార్మికులు పేదల పక్షాన ప్రశ్నించే సత్తా కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతుల్ని, కార్మికులను, కర్షకులను ఉపాది కూలీలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డి.స్వామన్న, ఏం.రాజు, ఎస్.బాలయ్య, బాల యేసు, బి.రమణమ్మ, అంజలి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :