Friday, 31 July 2026 07:24:27 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సీబీజీ ప్లాంటును ప‌రిశీలించిన ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 18 February 2026 11:10 PM Views : 180

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : కంచిక‌చ‌ర్ల మండ‌లం, ప‌రిటాలలో ఏర్పాటుచేస్తున్న రిల‌య‌న్స్ న్యూ ఎనర్జీ - కంప్రెస్డ్ బ‌యోగ్యాస్ (సీబీజీ) ప్లాంటును ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ బుధ‌వారం సంద‌ర్శించారు. 30 ఎక‌రాల విస్తీర్ణంలోని ఈ ప్లాంటును త్వ‌ర‌లో గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్రారంభించే అవ‌కాశ‌మున్నందున ప్లాంటులో జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలించారు. రోజుకు 22 ట‌న్నుల సీబీజీ ఉత్ప‌త్తి ల‌క్ష్యంగా ప్లాంటును సిద్ధం చేస్తున్న‌ట్లు ప్లాంటు సిబ్బంది వివ‌రించారు. స్థానిక వ్య‌వ‌సాయ వ్య‌ర్థాలు, మునిసిప‌ల్ ఘ‌న వ్య‌ర్థాలు వంటి వాటిని ఉప‌యోగించి ప‌ర్యావ‌ర‌ణ హిత ఇంధ‌నాన్ని ఉత్ప‌త్తి చేసేందుకు ఇలాంటి ప్లాంటులు దోహ‌దం చేస్తాయ‌న్నారు. ఉపాధి అవ‌కాశాల‌ను విస్తృతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా చేయూత‌నిస్తాయ‌న్నారు. క‌ర్బ‌న ఉద్గారాల‌కు క‌ళ్లెం వేయ‌డంతో పాటు రాష్ట్రాన్ని క్లీన్ ఎన‌ర్జీ హ‌బ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం సీబీజీ ప్లాంట్ల‌ను పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తోందన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నందిగామ ఆర్‌డీవో కె.బాల‌కృష్ణ‌, సంస్థ డీజీఎం శ్రీకాంత్‌, మేనేజ‌ర్ శ్రీచ‌ర‌ణ్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ చిట్టిబాబు ఉన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :