Friday, 17 April 2026 03:47:57 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ప్రభుత్వం పదో తరగతి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో మినహాయింపు ఇవ్వాలి

Date : 20 November 2025 09:06 PM Views : 898

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : పదో తరగతి పరీక్షల కోసం ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సెలవు రోజుల్లో లేకుండా, కేవలం పాఠశాల పనిదినాల్లో మాత్రమే నిర్వహించాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్. చాంద్ బాష లు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నంద్యాల జిల్లా, వెలుగోడు మండలంలోని, అన్ని గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత, మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు వై.రాంపక్కి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష లు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, ఆ విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి. పదోన్నతులు కల్పించాలని, టెట్ నుంచి మినహాయింపు కోసం, విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30 శాతం ఐ.ఆర్. మధ్యంతర భృతి ఇవ్వాలని, జి ఆర్-11 హెచ్ఎంలు స్కూల్ అసిస్టెంట్ (సబ్జెక్ట్, లాంగ్వేజ్ & స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టుకు ఎస్జీటీ లకు పదోన్నతులు కల్పించాలని, 2025 బదిలీల్లో బదిలీ అయ్యి రిలీవర్ లేక పాత స్థానాల్లో కొనసాగే వారిని రిలీవర్ తో సంబంధం లేకుండా రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు వెలుగోడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ మొయినుద్దీన్, అబ్దుల్ అహద్, రాష్ట్ర నాయకులు పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్ జిల్లా నాయకులు మహేష్, మునిరెడ్డి, బాపూజీ నాయక్, మోమిన్ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలు తెలుసుకొని, పరిష్కారానికి తగిన ప్రాతినిధ్యం వహిస్తామని స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :