ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : కొట్టాలచెరువు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు మెనూ ప్రకారం చికెన్ వండలేదని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు ఆరోపించారు. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, కొట్టాలచెరువు గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ ఆదివారం మెనూ ప్రకారం చికెన్ కర్రీ, కలర్ రైస్, గోంగూర చట్నీ ఉండగా గిరిజన విద్యార్థులకు చికెన్ ఒండకుండా చాలీసాలని చికెన్ వండి చారు, అన్నం పెట్టారని ఆశ్రమ పాఠశాల నందు స్థానికంగా వార్డెన్ లేరని ఆయన అన్నారు. పిల్లలకు ఇంత చలికాలంలో కూడా రగ్గులు లేవని ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నరైస్ ఇస్తున్న మెరుగైన వంటలు వండి పిల్లలకు పెట్టాలని చెప్తున్నా కొంతమంది వార్డెన్లు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా వ్యవహరించిన వారిపై ప్రభుత్వానికి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.పిల్లలకు అందుబాటులో లేకుండా, చాలిచాలని కూరలు వండించిన వార్డెన్ పై చర్యలు తీసుకునే విధంగా చూస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News