ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : సిద్దేశ్వరంలో నివసిస్తున్న చెంచులను ఐటీడీఏలో చేర్పించి వారిని ఆదుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా జూపాడుబంగ్లా మండలంలోని, పారుమంచాల మజార గ్రామమైన సిద్దేశ్వరంలోని చెంచు కుటుంబాలను సందర్శిస్తూ డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి పది చెంచుల కుటుంబాలు నివసిస్తున్నారన్నారు అయితే వారిని ఇంతవరకు ఐటీడీఏలో చేర్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఐటీడీఏ పరిధిలో లేనందున ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వారికి అందడం లేదని ఆయన మండిపడ్డారు. ఎన్నోసార్లు జిల్లా అధికారులకు తెలియజేసిన ఇంతవరకు ఐటీడీఏ అధికారులు సిద్దేశ్వరం గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. వెంటనే రెవిన్యూ అధికారులు కూడా వారి నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని, అలాగే రేషన్ కార్డులు కూడా లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కు, గౌరవ ఎమ్మెల్యే కి తెలియజేస్తానని ఆయన అన్నారు.
Admin
E Nivas News