Saturday, 25 April 2026 10:55:25 PM
# ఆర్టీసీ కార్మికులు అధైర్యానికిలోనుకావద్దు # తెలంగాణ రాష్ట్ర సేన ద్వారా ప్రజలకు న్యాయం చేస్తాం.. # ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుంది # ఎదురుపాడు చెంచు కాలనీలకు మౌలిక వసతులు కల్పించండి # అర్హులైన పాత్రికేయులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు # కెసిఆర్ లేకపోతే కవిత ప్రస్తా వన ఉండేదా? # సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి # స‌జ్జ‌నార్‌కు పదోన్నతి.. # హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు..! రేవంత్ రెడ్డి కుట్రలకు చెక్ పెట్టిన న్యాయస్థానం.. # యేసు పునరుత్థాన జాతరకు వేళాయె.. # మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సత్యనారాయణ పటేల్ # ఆర్టీసీ కార్మికుల మరణాలకు రేవంత్ రెడ్డి సర్కారే పూర్తి బాధ్యత వహించాలి.. # ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం.. # ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల సీఎం సంతాపం.. # ప్రజలకు తెలిసేలా వాస్తవాలను ప్రచురించాలి... # వడదెబ్బతో ఫోటోగ్రాఫర్ మృతి # ప్రజా పాలన ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు # కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి # నంద్యాల పట్టణంలో మే,-9న జరిగే దళిత క్రైస్తవుల గర్జన' పోస్టర్ విడుదల చేసిన నంద్యాల ఎంపీ-డాక్టర్ బైరెడ్డి శబరి # ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు:- సిపిఐ(ఎంఎల్) లిబరేషన్

సిద్దేశ్వరం చెంచులను ఐటీడీఏలో చేర్పించండి

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు

Date : 25 April 2026 05:59 AM Views : 14

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : సిద్దేశ్వరంలో నివసిస్తున్న చెంచులను ఐటీడీఏలో చేర్పించి వారిని ఆదుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా జూపాడుబంగ్లా మండలంలోని, పారుమంచాల మజార గ్రామమైన సిద్దేశ్వరంలోని చెంచు కుటుంబాలను సందర్శిస్తూ డీవీఎంసీ మెంబర్ లింగాల.నాగరాజు మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి పది చెంచుల కుటుంబాలు నివసిస్తున్నారన్నారు అయితే వారిని ఇంతవరకు ఐటీడీఏలో చేర్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఐటీడీఏ పరిధిలో లేనందున ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వారికి అందడం లేదని ఆయన మండిపడ్డారు. ఎన్నోసార్లు జిల్లా అధికారులకు తెలియజేసిన ఇంతవరకు ఐటీడీఏ అధికారులు సిద్దేశ్వరం గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. వెంటనే రెవిన్యూ అధికారులు కూడా వారి నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు మంజూరు చేయాలని, అలాగే రేషన్ కార్డులు కూడా లేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్ కు, గౌరవ ఎమ్మెల్యే కి తెలియజేస్తానని ఆయన అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :