Thursday, 30 July 2026 06:09:09 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 192 అర్జీలు ఇందులో 54 రెవెన్యూ, 138 నాన్ రెవెన్యూ అర్జీలు..! ప్ర‌తి అర్జీకి ప్ర‌త్యేక దృష్టితో ప‌రిష్కారం చేస్తాం

జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

Date : 10 February 2026 09:05 AM Views : 162

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) జిల్లాస్థాయి కార్య‌క్ర‌మం ద్వారా మొత్తం 192 అర్జీలు వ‌చ్చాయని.. వీటిలో 54 రెవెన్యూ అర్జీలు కాగా, 138 రెవెన్యూయేత‌ర అర్జీలు ఉన్న‌ట్లు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ తెలిపారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌.. అధికారుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. నాన్ రెవెన్యూ అర్జీల్లో పుర‌పాల‌క శాఖ‌కు సంబంధించి 31, పోలీసు శాఖ‌కు 27, డీఆర్‌డీఏకు 25, పంచాయ‌తీరాజ్ శాఖ‌కు 12 అర్జీలు వ‌చ్చాయ‌న్నారు. విద్యుత్‌, పౌర స‌ర‌ఫ‌రాలు, ఆరోగ్య శాఖ‌ల‌కు అయిదు చొప్పున అర్జీలు రాగా సీఆర్‌డీఏకు సంబంధించి నాలుగు అర్జీలు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయం, ఇరిగేష‌న్‌కు మూడు చొప్పున అర్జీలు రాగా, విద్య‌, నైపుణ్యాభివృద్ధి, స‌ర్వే, సాంకేతిక విద్య‌కు రెండు చొప్పున అర్జీలు వ‌చ్చాయ‌న్నారు. ప్ర‌జా ర‌వాణా, ఎండోమెంట్‌, మైనారిటీ సంక్షేమం, ఎల్‌డీఎం, ప‌రిశ్ర‌మ‌లు, మైన్స్‌, కాలుష్య నియంత్ర‌ణ‌, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా, ర‌హ‌దారులు-భ‌వ‌నాల శాఖ‌ల‌కు ఒక‌టి చొప్పున అర్జీలు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించి నిర్దేశ గ‌డువులోగా ప‌రిష్క‌రించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ ఆయా శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా స‌మ‌స్య‌కు స‌రైన ప‌రిష్కారం చూప‌డంలో చిత్త‌శుద్దితో ప‌నిచేయాల‌ని సూచించారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :