ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం, పాములపాడులోని, సేవా భారతి (వై.ఆర్.డి.ఎస్) కార్యాలయం దగ్గర ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సమితి సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఎం.వెంకట రమేష్ మాట్లాడుతూ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రతిపక్ష పార్టీ కోటి సంతకాల సేకరణ గురించి మాట్లాడుతూ పనిలేని మంగలోడు అనే పదం మాట్లాడి నాయి బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గత రెండు నెలల కిందట ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి పార్టీ చలో మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతూ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు కూడా నాయి బ్రాహ్మణులకు కించపరుస్తూ మాట్లాడడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడుతున్న ఎమ్మెల్యేలను చూసి చూడనట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు లు ఉండడం ఎంతవరకు సమంజసంమన్నారు. తెలుగుదేశం పార్టీ పార్టీ గెలవడానికి నాయి బ్రాహ్మణుల ఓట్లు అవసరం, పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ఎమ్మెల్యేలు నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ మాట్లాడుతుంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యేలపై, నాయకులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాగే మళ్లీ జరిగిందంటే ఆ ఎమ్మెల్యేలకు ఓట్లతో బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రసాద్, శ్రీరాములు, వెంకటకృష్ణ, శేషన్న, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు.
Admin
E Nivas News