ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / మహారాష్ట్ర/ముంబై : కర్నూలు పట్టణంలోని, ఉర్దూ భవన్ లో ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ నూతన చైర్మన్ టి.రామచంద్రుడు గారిని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ & ఉమ్మడి జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది జి.నాగముని, న్యాయవాదులు మోహన్, అయ్యస్వామి, రామచంద్రుడు, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఉమ్మడి కర్నూలు జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కొరకు, ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని నూతన చైర్మన్ కు విన్నవించడం జరిగింది.
Admin
E Nivas News