ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని ఏపీ వడ్డెర సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు పల్లపు మౌలాలి అన్నారు. వారు కొత్తపల్లి మండల పరిధిలోని, జడ్డువారిపల్లి గ్రామంలో వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను వడ్డెర సంఘం నాయకులతో కలిసి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వడ్డెర సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు పల్లపు మౌలాలి మాట్లాడుతూ రేనాటి ప్రాంతంలో జన్మించిన వడె ఓబన్న బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని తెలిపారు. రేనాటి పాలేగాళ్లకు, బ్రీటీష్ కంపెనీకి మధ్య బట్వారీ విషయంలో ఘర్షణలు ప్రారంభమైనప్పుడు ఆయన రేనాటి వీరుల పక్షాన నిలబడ్డారని గుర్తుచేశారు. క్రమేపి బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసేవారని, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చేసిన సాయుధ పోరులో వడ్డె ఓబన్న సైన్యాధక్షుడిగా వ్యవహరించారన్నారు. దట్టమైన నల్లమల అడవుల్లో సైతం ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఊచకోత కోసి, ఉరుకులు పెట్టించడంలో ముఖ్య భూమిని పోషించారని పేర్కొన్నారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన విప్లవ వీరుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి వెన్నెముకలా ఆయన నిలిచారన్నారు. ఆయన చేసిన అలుపెరుగని పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లపు. ఉషనయ్య, టీ.రామకృష్ణ, చంద్రగిరి, మల్లేష్, టి.ఈదుస్వామి, చంద్రగిరి వెంకటేశ్వర్లు, మార్ల ఎల్లిశ్వరయ్య, టీ.పులయ్య, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News