Thursday, 30 July 2026 07:20:13 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దు చేసుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రైతు సంఘాల విన్నపం

Date : 22 July 2026 10:44 PM Views : 41

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : భారత ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ దీనిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు పాములపాడు డిప్యూటీ తహసిల్దార్ పఠాన్ బాబుకు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు కే. నాగేశ్వర్ రెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు డి.స్వామన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్.బాలయ్య, కె.ఏసేపు, రైతు సంఘం నాయకులు బాల యేసు, వెంకటేశ్వర్లు, రంగస్వామి తదితరులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే మన రైతాంగం అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. డా॥ స్వామినాథన్ కమిషన్ సూచన సీ2+50 సూత్రం అమలు చేయబడినందున, మన రైతాంగం ఏటా 3 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి, పొగాకు, టమోటా, మామిడి, కోకో, రొయ్యలు తదితర పంటలు కనీస మద్దతు ధరలు కూడా లేక, కొనే నాధుడు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ స్థితిలో అమెరికా నుండి దిగిమతులు వచ్చిపడితే మన రైతాంగం పూర్తిగా నష్టపోతారన్నారు. కావున స్వేచ్ఛా -వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంతకం చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతున్నాం అన్నారు అన్నారు. గతంలో ఎస్.కె.ఎమ్. నాయకత్వానికి హామీ ఇచ్చిన విధంగా అన్ని పంటలకు సీ2+50 ప్రకారం మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల వ్యవసాయ, కార్మికుల రుణాలు ఒక్కసారి రద్దు చేయించాలని కోరుతున్నామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :