Thursday, 30 July 2026 08:16:18 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

వికసిత్ భారత్ జి రాంజీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు

Date : 18 May 2026 08:54 PM Views : 123

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పగిడ్యాల : వికాషిత్ భారత్ జి రాంజీ పథకం రద్దు చేయాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి, జాతీయ ఉపాధి హామీ పథకం పని చేస్తున్న వ్యవసాయ కూలీలకు గడ్డపార పనిముట్లు పంపిణీ చేసి,పాత విధానాన్ని కొనసాగించాలని సి.పి.ఐ(ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం రోజు పగిడ్యాల మండలంలోని, లక్ష్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంచ వద్ద ఉన్న చెరువులో పని చేస్తున్న వ్యవసాయ కూలీలను కలిసి వారికున్న సమస్యల గురించి వివరంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం సి.పి.ఐ (ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని తీర్మానం చేయాలని సి.పి.ఐ (ఎం.ఎల్) లిబరేషన్ డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గం ఉపాధి కూలీలకు మౌలిక వసతులు కల్పించాలని మంచినీటి సమస్య, మజ్జిగ, 4 కిలోమీటర్లు నడిచి వస్తున్న వారికి రవాణా చార్జీలు ఇవ్వాలని,పేస్ యాప్ రద్దు చేయాలని, సరైన సమయంలో నెట్టు రాకపోవడంతో కొంతమంది కూలీలు వెనక్కి పోయే పరిస్థితి ఉందన్నారు. కూలీలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందన్నారుగత 10 సంవత్సరాల క్రిందట ఇచ్చినటువంటి గడ్డపారలు తప్ప, ఇంతవరకు పనిముట్లు ఇవ్వలేదని ఆవేదన పడ్డారు ఉపాధి కూలీలకు ఉష్ణోగ్రత 45%శాతం ఉండడం వల్ల ఉపాధి కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కూలీలకు రోజు వారి కూలీ 600 రూపాయలు వేతనం కల్పించాలని 200 రోజులు పని కల్పించాలని వేసవి అలవెన్స్ 30 శాతం ఇవ్వాలని ప్రతి ఉపాధి కూలీకి పదివేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని పనిచోట ప్రమాదంలో చనిపోతే రూ.30 లక్షలు ఇవ్వాలని ప్రమాదంలో గాయపడిన రూ 5.లక్షలు ఇవ్వాలని, వారికి వీటి సాధనకై ఈ పోరాటాల కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికల ఉద్యమం కొనసాగించడానికి సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సాములు, జి.జయరాజు, ఏం.సలీం, ఎం.విష్ణువర్ధన్, ఎస్.సలీం, ఎల్.రాజా గౌడ్, జి.నాగన్న, వై.సునీల్, వై.లోకన్న, కే.ఏసేపు, వై.చక్రి, ఫిట్టర్ మాబు, కే.దావీదు, జి.రాజాముని,ఎస్.వజీర్ భాష, ఎం.శ్రీనివాసులు, బి.గోకారి, పి.శేషన్న, ఏ.జానకి రామ్, ఏంరంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :