ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు/ పత్తికొండ : పత్తికొండ పట్టణంలో ఒక కోటి, నాలుగు లక్షలు రూపాయల నిధులతో కట్టిన ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ డైటింగ్ హాల్ ను ఎమ్మెల్యే కె.శ్యాంబాబు, ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు నాగిరెడ్డి, ఇంజనీర్ అజాజ్ భాష కాంట్రాక్టర్ నరేష్, సోషల్ వెల్ఫేర్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.శ్యాంబాబు, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని లు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించిన ప్రత్యేక చొరవ పదో తరగతి విద్యార్థులకు సూచనలు, చదువుకొనుటకు వారికి అందివచ్చే అవకాశాల గురించి తెలియజేయడం జరిగింది. 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు హాస్టల్ కు మంచి పేరు తీసుకురావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News