Friday, 31 July 2026 05:54:17 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

స్వచ్ఛ్ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం, పల్స్ పోలియో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 20 December 2025 07:06 PM Views : 221

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, వడ్డమాను గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛ్ ఆంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో పాల్గొని స్కూల్ ఆవరణలో చెట్లు నాటి, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, వడ్డమాన్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే గిత్త.జయసూర్య అధికారులు, నాయకులతో, వైద్య సిబ్బందితో కలిసి చెత్తను ఊర్చి శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. "స్వచ్ఛ్ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, పచ్చగా మరియు ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్లాస్టిక్ రహిత గ్రామాలలో ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి," అని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం డిసెంబర్-21 న రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 0-5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే శిబిరాలలో పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, వైద్యసిబ్బంది గ్రామాలలో ఐదేళ్ల లోపు చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలియో చుక్కలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలిపారు. పోలియో వ్యాధిని తరిమికొట్టి మన పిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం అని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, ఈఓఆర్డి ఎస్.వెంకటరంగా నాయక్, నాయకులు సత్యం రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రామచంద్రుడు, తలారి వెంకటరాముడు, గజేంద్ర, దిలీప్ నాయుడు, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ-మద్దిలేటి, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు సిబ్బంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: