ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్.బేబీ ని ఆమె కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, పట్టణ టిడిపి అధ్యక్షులు వేణుగోపాల్, తదితర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్చం చేతికి అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణానికి అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని, స్థానిక శాసన సభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి సహకారంతో ముందుకు సాగాలని, వారికి పట్టణ అభివృద్ధి విషయంలో కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వీరి వెంట ఏఈ ఓబులేసు, తెలుగుదేశం పార్టీ నాయకులు రామ్మూర్తి, ఆన్సర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News