ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణానికి చెందిన శ్రీ రామ ఫోటో స్టూడియో యజమాని గంధం నగేష్ (55) వడదెబ్బతో ఆకస్మికంగా మృతి చెందాడు. గురువారం విధినిర్వహణలో ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి ద్విచక్ర వాహనం పై వెళ్లి కర్ణ వేద కార్యక్రమానికి ఫోటోలు తీసి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చి కస్మాత్తుగా పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు మంథని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికప్పుడే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఫోటోగ్రాఫర్ మూర్తి పట్ల మంథని పట్టణంలోని ఫోటోగ్రాఫర్ల యూనియన్ నాయకులు దిగ్బాంతి వ్యక్తం చేశారు.
Admin
E Nivas News