ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని అంబేద్కర్ ప్రధాన కూడలి వద్ద మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళనం కరపత్రాన్ని మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళన అధ్యక్షులు కర్నె హరిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్నె హరిబాబు మాట్లాడుతూ, ఈ నెల 29 న మంథని కాళాశాల మైదానంలో నిర్వహించనున్న విరాట్ హిందూ సమ్మేళనానికి హిందువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే విశ్వహిందూ పరిషత్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ మంథని ఖండ కార్యవాహ గర్రెపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సమాజంలో ఐక్యత, ధార్మిక చైతన్యం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. "గడప లోపల కులం గడప దాటితే హిందువులం" అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రపురి విరాట్ హిందూ సమ్మేళన సమితి సభ్యులు కనుకుంట్ల స్వామి, మాడిశెట్టి సురేందర్, మాడిశెట్టి సుదర్శన్, బొడ్డు సతీష్, దువ్వ తిరుపతయ్య, లింగం శంకర్, కొమురవెల్లి హరీష్, నామని నగేష్, తూర్పాటి రాము, కొమురవెల్లి కిరణ్, నరేందర్ రెడ్డి, ఆంజనేయులు, రాజమౌళి గౌడ్ పాల్గొన్నారు.
Admin
E Nivas News