ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కాకుండా అడ్డుకుంటున్న బిజెపి మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్ సందర్భంగా బిజెపి,మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా పోరాటం కొనసాగాలని సిపిఎం పిలుపునిస్తుందన్నారు . సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ కు, రాష్ట్రపతికి కేంద్ర,మోడీ ప్రభుత్వానికి పంపించి ,6 నెలలు గడిచిపోయిన నేటికీ బీసీ రిజర్వేషన్ల కు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని సిపిఎం ప్రశ్నిస్తుందన్నారు. బిల్లులను తమ దగ్గరలో ఉంచుకొని నీచ రాజకీయాలు చేయడం రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న రాష్ట్రపతి, గవర్నర్ సరైనదేనా...? బిజెపి, మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తే విధంగా వీరి వైఖరి ఉన్నది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి చట్టబద్ధత కల్పించడానికి అవకాశాలున్న బిజెపి మోడీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయడం కోసమే చూస్తున్నదితాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక తీరు ఇతర రాష్ట్రాల్లో మరో తీరుగా వ్యవహరిస్తున్నదన్నారు . బిజెపి నీచ రాజకీయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఇంకా సామాజికంగా వెనుకబాటుతనంలోకి నెట్టబడుతున్నారు.బిజెపి కి తగిన గుణపాఠం చెప్పే విధంగా కేంద్ర వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.కేంద్రం పైన పోరాటం చేయడం కోసం రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన పార్టీలను, సంఘాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాలకు ముందు పీఠాన ఉండాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బోడంకి చందు మండల కార్యదర్శి,కమిటీ సభ్యులు సిడం సమ్మక్క,బోగే నాగజ్యోతి,బండారి శ్రీనివాస్,బండారి రాజేశ్వరి, భోగే సత్యం,కొండపర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News