Friday, 17 April 2026 05:02:19 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

బిసి రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బిజెపి పైన పోరాటమే

అక్టోబర్ 18 న మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిరసన, ధర్నా కార్యక్రమాలకు సీపీఎం పిలుపు

Date : 15 October 2025 07:59 PM Views : 176

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కాకుండా అడ్డుకుంటున్న బిజెపి మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్ సందర్భంగా బిజెపి,మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా పోరాటం కొనసాగాలని సిపిఎం పిలుపునిస్తుందన్నారు . సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ కు, రాష్ట్రపతికి కేంద్ర,మోడీ ప్రభుత్వానికి పంపించి ,6 నెలలు గడిచిపోయిన నేటికీ బీసీ రిజర్వేషన్ల కు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని సిపిఎం ప్రశ్నిస్తుందన్నారు. బిల్లులను తమ దగ్గరలో ఉంచుకొని నీచ రాజకీయాలు చేయడం రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న రాష్ట్రపతి, గవర్నర్ సరైనదేనా...? బిజెపి, మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తే విధంగా వీరి వైఖరి ఉన్నది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి చట్టబద్ధత కల్పించడానికి అవకాశాలున్న బిజెపి మోడీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయడం కోసమే చూస్తున్నదితాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక తీరు ఇతర రాష్ట్రాల్లో మరో తీరుగా వ్యవహరిస్తున్నదన్నారు . బిజెపి నీచ రాజకీయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఇంకా సామాజికంగా వెనుకబాటుతనంలోకి నెట్టబడుతున్నారు.బిజెపి కి తగిన గుణపాఠం చెప్పే విధంగా కేంద్ర వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.కేంద్రం పైన పోరాటం చేయడం కోసం రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన పార్టీలను, సంఘాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాలకు ముందు పీఠాన ఉండాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బోడంకి చందు మండల కార్యదర్శి,కమిటీ సభ్యులు సిడం సమ్మక్క,బోగే నాగజ్యోతి,బండారి శ్రీనివాస్,బండారి రాజేశ్వరి, భోగే సత్యం,కొండపర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :