ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన నిరుపేద వృద్ధురాలు ఆవునూరి గట్టమ్మకు శ్రీ వైద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులు అందజేశారు. తన కుమార్తె అమెరికాకు వెళ్ళే సందర్భంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించినట్లు ఇన్కమ్ టాక్స్ కన్సల్టెంట్ సిరిముళ్ల రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన రామ్మోహన్ కుటుంబానికి శ్రీ వైద్య ఫౌండేషన్ చైర్మన్ బుద్దార్థి సతీష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ మెంబర్ కె సతీష్, వైస్ చైర్మన్ బి అశోక్, కోశాధికారి ఎం అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News