Friday, 31 July 2026 07:22:41 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సిపిఐ పొత్తును కాంగ్రెస్ విమర్శించడం వారి విజ్ఞతకే నిదర్శనం

సీపీఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్

Date : 01 December 2025 08:28 PM Views : 237

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సిపిఐ పొత్తును కాంగ్రెస్ విస్మరించడం వారి విజ్ఞతకే నిదర్శనమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ సీపీఐ స్థానాల్లో పోటీ చేయడం న్యాయం కాదని, కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు . సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్ధతు ఇచ్చిందన్నారు. కానీ నేటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ కి సహకరించి పొత్తు ధర్మాన్ని పాటిస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ నేడు అభ్యర్థులను పోటీలో నిలిపి ద్వంద నీతిని ప్రదర్శించడం అన్యాయమన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజా పోరాటాల ద్వారా పలు రకాల సమస్యలకు పరిష్కారం చూపుతున్న సీపీఐ పొత్తును కాంగ్రెస్ నాయకులు విస్మరించడం వారి అహంకార ధోరణికి నిదర్శనం అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని 118 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు సీపీఐ మద్ధతు ఇచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాకుండా ప్రజలు జరుగుతున్న అన్ని రకాల పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారని తెలిపారు. అంతకుముందు దౌడపల్లి సర్పంచ్ అభ్యర్థి మేదరి దేవవరం మాట్లాడుతూ తాను సర్పంచ్ పోటీలో లేనంటూ అసత్య ప్రచారం చేస్తూ సీపీఐ ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తన నిస్వార్ధ సేవలను, ప్రజలకు అందుబాటులో ఉంటే విధానాన్ని బట్టి న్యాయంగా ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు.ప్రజా క్షేత్రం లో తనకు ఆదరణ ఉందని, ఇండిపెండెంట్ వార్డ్ అభ్యర్థులు కూడా తనకు మద్ధతుగా ఉన్నారని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగం రవి, జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, ఏఐటీయూసీ నాయకులు రమణ రెడ్డి,నాయకులు దేవయ్య, మధుకర్, దేవేందర్, సత్తన్న, శాంతయ్య, శ్రీదేవి, విజయలక్ష్మి, శంకరయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :