ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు ఎదుగుదల కళాశాల స్థాయినుంచె ప్రారంభమవుతుందని శ్రద్ధ, లక్ష్యంతో చదివినట్లయితే వారి భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరుతుందని సిరిపురం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శనివారం కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్ లో నిర్వహించిన వసుంధర జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ప్రేషర్స్ డే వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని లక్షల లక్షల అధిరూపాయలు ఖర్చు చేసి చదివిస్తున్నారని వారి యొక్క నమ్మకాన్ని అమలు చేయకుండా శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో రాణించినట్లయితే వారి ఆనందానికి అవధులు ఉండవన్నారు. ఉన్నత పాఠశాల విద్య వరకే తమ యొక్క చిలిపి చేష్టలు సాగుతాయని తర్వాత వచ్చే కళాశాల విద్య విద్యార్థి జీవితంలో మలుపు తీసుకువస్తుందన్నారు. విద్యార్థుల ఎదుగుదల కళాశాల స్థాయి నుంచే ప్రారంభం అవుతుందని , ఈ వయస్సులో మొబైల్ ఫోన్లకు, సోషల్ మీడియాకు, చెడు వ్యసనాలకు అట్రాక్ట్ అవకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మెమంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సంస్కృతి కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News