ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బోథ్, సోనాల మండలాల కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. అనంతరం నెరడిగొండలో బజార్ హత్నూర్, నెరడిగొండ మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడాలని, పార్టీలోనే విభేదాలు పెట్టుకోకుండా గ్రామ అభివృద్ధి పార్టీ బలోపేతమే ప్రధాన ఎజెండాగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News