ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీబీసీ సంఘాల రిజర్వేషన్లలో అవకతవకలు జరగాయని ఆరోపిస్తూ సంఘాల రిజర్వేషన్లలో అవకతవకలు జరగాయని ఆరోపిస్తూ, వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి అందులో బీసీలకు రిజర్వేషన్లు 50% క్యాపు మించకుండా ఏర్పాటు చేయాలన్నప్పుడు 20% రిజర్వేషన్లు బీసీలకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడు 29 గ్రామపంచాయతీలలో సుమారు 7 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ కేటాయించవలసి ఉండగా కేవలం రెండు గ్రామపంచాయతీలు అయిన చింతలపల్లె, లింగయ్య పల్లె అనే చిన్న గ్రామాలను బీసీలకు రిజర్వేషన్ చేశారన్నారు. జన్నారం మండలం బిసి సంఘం తరఫున మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో షరీఫ్ కి వినతిపత్రం అందజేసి బీసీ రిజర్వేషన్లు సవరించి ఏడు స్థానాలు బీసీలకు కేటాయించే ఏర్పాటు చేయాలని జన్నారం మండలం బిసి సంఘం తరఫున వినతిపత్రం అందజేశారు. ఒక గంట సమయం ఇచ్చి ఉన్నత అధికారులను సంప్రదించి మార్పులు చేసే ప్రయత్నం చేయాలని కోరగా ఎంపీడీవో ఈ విషయం నా పరిధిలో లేదు అని అనడంతో జన్నారం మండల బీసీ సంఘం తరఫున ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో దాదాపు అరగంట వందలాది వాహనాలు రోడ్డుకి ఇరువైపులా ఆగిపోయాయి విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో చేస్తున్న స్థలాన్ని చేరుకొని నాయకులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్, బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, కో కన్వీనర్ కడార్ల నర్సయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ, మాజీ ఎంపిటిసి, మాజీ సర్పంచ్ కొంతం శంకరయ్య, పొనకల్ మాజీ ఉపసర్పంచ్ బిసి మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్, పొనకల్ మాజీ ఎంపిటిసి రాగుల శంకర్, బీ ఆర్ ఎస్ జన్నారం మండలం ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, సి పి ఐ ఎం జన్నారం మండల కార్యదర్శి కనికరపు అశోక్, మహిళా నాయకురాలు జయమ్మ, వాసాల నరేష్, మోకు దెబ్బ మంచిర్యాల డివిజన్ అధ్యక్షుడు ఒల్లాల నరస గౌడ్, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆంధ్ర పురుషోత్తం, జన్నారం మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి సంద గోపాల్, జన్నారం మండలం మాజీ మండల పరిషత్ వైస్ చైర్మన్ సుతారి వినయ్ మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు లెక్కల మల్లయ్య ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గోపి, సత్యనారాయణ అప్పాల జలపత్, లసెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News