Friday, 31 July 2026 01:52:51 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అభివృద్ధి పనులకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 200 వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరికలు

Date : 24 January 2026 08:39 PM Views : 289

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో దాదాపు 200 మంది శనివారం చేరారు. చేరిన వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్త సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా మంచిర్యాలలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని పాలించిన 7 గురు ఎమ్మెల్యేలు చేయని అభివృద్ధిని నేను చేశానన్నారు. సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న కార్మిక కుటుంబాలకు రెండు నెలల్లో శాశ్వత ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలోని 282 పాఠశాలల్లో విద్య వ్యవస్థను ఆధునికరిస్తున్నా మన్నారు. కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి కోసం 150 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించానని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో త్రాగునీరు, సాగు నీటికి, మౌలిక సదుపాయాలకు ప్రజలు అనేకఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దండేపల్లి, లక్షెట్టిపేట్ మండలాల్లోని మోదెల, ద్వారక, గుడి రేవు, గూడెం గ్రామాలలో 4 మినీ లిఫ్ట్ నిర్మాణ పనులను అతిత్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా మంచిర్యాల నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల ను మంజూరు చేశామన్నారు. ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు ప్రజలను ఓటు అడిగే అర్హత లేదన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 60 సీట్లు సాధించి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని నా అన్నదమ్ములుకి అక్క చెల్లెలుకి ఏ ఆపద వచ్చినా మీ అందరికీ నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు , నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :