ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల మధ్యన జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ జాతి విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన గొప్ప ఉద్యమకారుడన్నారు. ఆర్థిక సమానత్వం కోసం తన తుది శ్వాస వరకు పోరాటం చేసిన గొప్ప మహానీయుడని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆయన ఆశయాలకు భిన్నంగా దేశంలో కులం మతం ప్రాంతం పేరుతో వైశ్యామ్యాలు సృష్టిస్తూ ప్రజల మధ్యన అనైక్యతను సృష్టిస్తుందని విమర్శించారు. గ్రామీణ పేదలకు ఆసర గా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి జి రాంజీ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. జి రాంజీ పథకం రావడం వల్ల గ్రామంలో కూలీలు ఉపాధి హామీ కూలీలు పనుల పట్ల శ్రద్ధ చూపడం లేదని పనులకు రావటం లేదని వేరే ఇతర పనులకు వెళుతున్నారని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి మొత్తం పథకాన్ని రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. జ్యోతిబాపూలే ఆశయాలకు అనుగుణంగా ఆయన పూర్తితో గ్రామీణ పేదలంతా ఐక్యమై ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏల్పుల సురేష్, బాబు రవి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Admin
E Nivas News