Friday, 17 April 2026 03:49:23 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

పూలే స్ఫూర్తితో ఉపాధిహామిని కాపాడుకుందాం

ఉపాధి కూలీల మధ్యన ఘనంగా పూలే జయంతి

Date : 11 April 2026 10:26 PM Views : 26

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల మధ్యన జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ జాతి విముక్తి కోసం అనేక పోరాటాలు చేసిన గొప్ప ఉద్యమకారుడన్నారు. ఆర్థిక సమానత్వం కోసం తన తుది శ్వాస వరకు పోరాటం చేసిన గొప్ప మహానీయుడని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆయన ఆశయాలకు భిన్నంగా దేశంలో కులం మతం ప్రాంతం పేరుతో వైశ్యామ్యాలు సృష్టిస్తూ ప్రజల మధ్యన అనైక్యతను సృష్టిస్తుందని విమర్శించారు. గ్రామీణ పేదలకు ఆసర గా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి జి రాంజీ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. జి రాంజీ పథకం రావడం వల్ల గ్రామంలో కూలీలు ఉపాధి హామీ కూలీలు పనుల పట్ల శ్రద్ధ చూపడం లేదని పనులకు రావటం లేదని వేరే ఇతర పనులకు వెళుతున్నారని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి మొత్తం పథకాన్ని రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. జ్యోతిబాపూలే ఆశయాలకు అనుగుణంగా ఆయన పూర్తితో గ్రామీణ పేదలంతా ఐక్యమై ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏల్పుల సురేష్, బాబు రవి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :