Thursday, 30 July 2026 06:09:58 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి...

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సాప్ కోడ్ ఇనోవేషన్ 2025–26 ప్రారంభంలో మంత్రి వివేక్

Date : 14 March 2026 07:04 AM Views : 198

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివారం మేడ్చల్ జిల్లా ఘాట్‌కేసర్‌లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సాప్ కోడ్ ఇనోవేషన్ 2025–26 కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన సాప్ కోడ్ ఇనోవేషన్ రూమ్‌ను మంత్రి వివేక్ వెంకటస్వామి రిబ్బన్ కట్ చేసిప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరంమంత్రి వివేక్ మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు రావడం తనకు ఎంతోఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి ఆలోచనతో ఈ విద్యాసంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరాలంటే శ్రద్ధగా వినడం, క్రమశిక్షణతో చదవడం ఎంతో అవసరమన్నారు. తన విద్యార్థి దశలో జరిగిన ఒక అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఏ పని చేసినా శ్రద్ధతో నేర్చుకోవాలని చెప్పారు. ప్రస్తుతం కొత్త కొత్త సాంకేతికతలు వస్తున్నాయని, వాటిని చూసి భయపడకుండా నేర్చుకోవాలని విద్యార్థులకుసూచించారు. సాంకేతికతను అవగాహన చేసుకుంటే భయం ఉండదన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న సాప్ కోడ్ ఇనోవేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంకటస్వామి సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం వివిధ కళాశాలల నుంచి వచ్చి సాప్ కోడ్ ఇనోవేషన్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పావనీ జంగయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :