ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యూఏసి, ఎన్ఎస్ఎస్ మరియు జువాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ పరిషయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన విద్యార్థినీ విద్యార్థులకు ఉండాలని తెలియజేశారు. జువాలజీ అధ్యాపకులు దుర్గం కృష్ణ గారు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాజంపై ఎయిడ్స్ ప్రభావం గురించిన అంశాల గురించి విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ . లక్ష్మీనారాయణ, చరిత్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్, ముఖ్య అతిథి డాక్టర్. స్రవంతి, అధ్యాపకులు అమర్నాథ్, ముకుందం, శేఖర్, శ్రీధర్, ఫర్జానా, మానస, బోధ నేతర సిబ్బంది శ్రీనివాస్, రాజు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News