ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలు నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ పరిధిలోని లక్షెట్టిపేట, జన్నారం పోలీస్ స్టేషన్ లపరిధిలోని తిమ్మాపూర్, ఫోన్ కల్ గ్రామాలలో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ లో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పోలీస్ అధికారులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రజల్లో నమ్మకం పెంపొందించడం , శాంతి భద్రతలు కాపాడడం మరియు ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడం లక్ష్యంగా నిర్వహించామన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి , ఎన్నికల నియమాలను పాటించి, మీ గ్రామాల్లో చట్ట వ్యతిరేకమైన, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో , గందరగోళం సృష్టించడం, బెదిరింపులకు పాల్పడటం, గొడవలకు పాల్పడడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వేచ్ఛాయుత , నిష్పక్షపతంగా, శాంతియుత ఎన్నికలు నిర్వహించడానికి కట్టుబడి ఉందన్నారు. ఈకార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, లక్షేట్టిపేట సీఐ రమణ మూర్తి, జన్నారం ఎస్ ఐ అనూష, దండేపల్లి ఎస్ ఐ తైసినోద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News