Thursday, 30 July 2026 07:53:14 AM
# తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

కరోనా కంటే ప్రమాదకరమైనవి డ్రగ్స్

Date : 25 October 2025 01:59 PM Views : 462

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరమైనదనవి డ్రగ్స్ అని వాటిని నిర్మూలించకపోతే వ్యక్తిగతంగా, సమాజానికి తీరని నష్టం జరుగుతుందని మంథని రెండొవ ఎస్సై సాగర్ అన్నారు. శనివారం మంథని పట్టణంలోని కాకతీయ హై స్కూల్ ఆధ్వర్యంలో కో కరికులర్ యాక్టివిటీలో భాగంగా డ్రగ్స్ నియంత్రణపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై డి సాగర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ చిన్నపిల్లలకు ఇలాంటి ఆలోచన రావడము చాలా అభినందనీయమన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లల్లో డ్రగ్స్ వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాంపై అవగాహన కల్పించాలన్నారు. ఇది కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరమైనదని దీనిని నిర్మూలించకపోతే మానవ మనుగడకే ప్రమాదము న్నారు. డ్రగ్స్ ను నిర్మూలించడం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మా వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల యువత చెడు దారి పడుతుందన్నారు. మత్తు పదార్థాలను నిర్మూలించకపోతే సమాజము పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయమై చెడిపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, పావని, స్రవంతి పోలీసులు, పోలీసు అధికారులు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :