Friday, 31 July 2026 06:21:12 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై

టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు...

Date : 31 March 2026 10:16 PM Views : 175

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఒక పోలీస్ అధికారి ఎంతగా ప్రజలను జలగలాగ పీడించి ఉండకపోతే అంతలా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. నీతి లేదు నియమం లేదు,కనీసం మానవత్వం కూడా ఉండటం లేదు. దినసరి కూలీలను కూడా వదలరు. కేసు వచ్చిందంటే. పీక్కు తినడమే ఆ ఎస్ఐ తీరు. అందరూ అలా ఉండరు కానీనీతిగా ఉండి విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు సిబ్బంది ఉన్నారు. కానీ ఇప్పుడు అవినీతి పరుల సంఖ్య పోలీస్ శాఖలో వేగంగా విస్తరిస్తోంది అనడంలో సందేహం లేదు అనే అభిప్రాయాలు సర్వత్వ వ్యక్తం అవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా ఎస్సై హరిప్రసాద్ రెడ్డి పట్టు పడ్డారు. ఇసుక అక్రమ రవాణా కేసులో సీజ్ చేసిన ట్రాక్టర్, జేసీబీని ఇవ్వడానికి ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు డబ్బులు ఇస్తుండగాట్రాప్ వేసి హరిప్రసాద్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనేఅంబేద్కర్ చౌరస్తాలో ఎస్సై బాధితులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అవినీతి ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చాలా మందిని డబ్బులకు పీడించాడని, దారుణంగా కొట్టేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల పేరుతో ప్రతి గ్రామంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా భూతగాదాలు, సివిల్ విషయాల్లో తలదూర్చి డబ్బులు దండుకున్నాడని బాధితులు ముక్త కంఠంతో తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :