Friday, 31 July 2026 04:59:21 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు..

Date : 13 February 2026 09:16 AM Views : 174

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్ 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనపై ప్రెస్‌నోట్‌లో వివరణ జగ్గారెడ్డి ఇచ్చారు . బుధవారం సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుడిని సీఐ గల్లా పట్టుకొని ఈడ్చుకొచ్చి కొట్టారని తెలిపారు. తన పార్టీ నాయకుడిని రక్షించుకోవడానికి బూత్‌కు వెళ్లి సీఐని తిట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతుగా సీఐ తమ పార్టీ నాయకుడిని అవమానించారని తెలిపారు. కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతినేట్లు చేసిన సీఐని తిట్టడం జరిగిందని జగ్గారెడ్డి వివరించారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని కానీ పది మంది మధ్యలో తమ పార్టీ నాయకుడికి సీఐ చేసిన అవమానం పోగొట్టడానికి బూత్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. ఎన్నికల నిబంధనలను సీఐ లేదా తాను ఉల్లంఘించినా అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అందరూ దానిని స్వాగతించాలని అన్నారు. న్యాయస్థానంలో ఎవరి తప్పు, ఎవరి ఒప్పు తేలుతుందని పేర్కొన్నారు. ఈ సంఘటనను నిన్న సాయంత్రం 5 గంటలకే వదిలేశానని చెప్పారు. మరోవైపు, బుధవారం సంగారెడ్డిలో జరిగిన సంఘటనను కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తిప్పారని మండిపడ్డారు. అధికారులపై జగ్గారెడ్డి దాడి చేస్తున్నారంటూ పదేపదే ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ‘గతంలో కేటీఆర్ ఒక పోలీసు అధికారిని బూతు పదజాలంతో తిట్టారన్నారు. తెలంగాణ పోలీసులను తన్ని, తిట్టి, ఆంధ్రోళ్లకు పుట్టారా' అంటూ హరీశ్ రావు నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ముందుగా కేటీఆర్, హరీశ్ రావు తిట్టిన విషయాలకు సమాధానం చెప్పి, ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :