Thursday, 30 July 2026 04:38:12 PM
# మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

విద్యార్థులు మొబైల్ లో వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దు

ఏఎస్ఐ అన్వర్

Date : 14 October 2025 09:54 PM Views : 294

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు మీయొక్క మొబైల్లో వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని స్థానిక ఏఎస్ఐ అన్వర్ విద్యార్థులకు సూచించారు. సోమవారం పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర పాఠశాల,కళాశాల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి చరణం లో ప్రతి ఒకరి ఇంట్లో స్మార్ట్ మొబైల్స్ ఉండడం సహజమేనని ఆ ఫోన్లో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లు తదితర తదితర ముఖ్యమైన విషయాలన్నీ అందులో ఉంటాయని సైబర్ మోసగాళ్లు పలు రకాల లింకులను పంపించడం జరుగుతుందని మీయొక్క తల్లిదండ్రులు సరిగ్గా విద్య రానివారైతే అలాంటి లింకులు ఓపెన్ చేసినట్లయితే డబ్బులు అన్ని దోచేసుకుంటారని తెలిపారు. మీరు చదువుకున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులకు ఇట్టి విషయాన్ని క్లుప్తంగా వివరించాలని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులు ఫోన్లో తదితర యాప్లు ఉన్నాయని ఆకులలో వచ్చే క్రీడలు తదితర వాటిని ఓపెన్ చేసి ఆడినట్లయితే వాటి ద్వారా కూడా డబ్బులు మోసపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా తెలియని మెసేజ్లు కానీ లింకులు గానీ వచ్చినట్లయితే వాటిని ఓపెన్ చేయవద్దని కోరారు. విద్య నేర్చుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి కానీ డ్రగ్స్ గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని అన్నారు. అనంతరం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ మంగ, ఏటీపీ తిరుమల్, పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :