ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా గురు వారం మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడి చికిత్స పొందుతూప్రాణాలు కోల్పోయిన కోల శంకర్ గౌడ్,కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుం దనినర్సంపేట ఆర్డిఓ ఉమారాణి తెలిపారు. ఆయన మృతి ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆవేదన నింపిన నేపథ్యంలో ప్రభు త్వం తక్షణమే స్పందించి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు నర్సంపేట ఆర్డీ వో ఉమారాణి అధికారిక ప్రకటన చేశారు. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన ఆర్డీవో ఉమారాణి మృతుడి కుటుంబ సభ్యులను పరా మర్శించారు. ప్రభుత్వం తరఫున అందించే సహాయ సహకారాలను అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యో గం కల్పిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో శంకర్ గౌడ్ కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన వ్యక్తిగతంగా మరో రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. కాగాగత 25 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్గా సేవలందించిన శంకర్కు భార్య హేమలత, కుమార్తె షామిలి, కుమారు డు హేమంత్ ఉన్నారు. భార్య హేమలత దివ్యాంగు రాలిగా తెలిసింది. సొంతిల్లు లేకపోవటంతో కూతురు స్వగ్రామం నర్సం పేట మండలం ముత్తోజి పేటకు తలించారు. అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శంకర్ గౌడ్కు నివాళి అర్పించారు.
Admin
E Nivas News