Friday, 31 July 2026 07:23:41 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం..

ఆర్డీవో ఉమారాణి..

Date : 25 April 2026 05:30 AM Views : 167

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా గురు వారం మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయ త్నానికి పాల్పడి చికిత్స పొందుతూప్రాణాలు కోల్పోయిన కోల శంకర్ గౌడ్,కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుం దనినర్సంపేట ఆర్డిఓ ఉమారాణి తెలిపారు. ఆయన మృతి ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆవేదన నింపిన నేపథ్యంలో ప్రభు త్వం తక్షణమే స్పందించి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు నర్సంపేట ఆర్డీ వో ఉమారాణి అధికారిక ప్రకటన చేశారు. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన ఆర్డీవో ఉమారాణి మృతుడి కుటుంబ సభ్యులను పరా మర్శించారు. ప్రభుత్వం తరఫున అందించే సహాయ సహకారాలను అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యో గం కల్పిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబం కావడంతో శంకర్ గౌడ్ కుటుంబానికి ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన వ్యక్తిగతంగా మరో రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. కాగాగత 25 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్‌గా సేవలందించిన శంకర్‌కు భార్య హేమలత, కుమార్తె షామిలి, కుమారు డు హేమంత్ ఉన్నారు. భార్య హేమలత దివ్యాంగు రాలిగా తెలిసింది. సొంతిల్లు లేకపోవటంతో కూతురు స్వగ్రామం నర్సం పేట మండలం ముత్తోజి పేటకు తలించారు. అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శంకర్ గౌడ్‌కు నివాళి అర్పించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :