ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్లు, క్రీడా విశ్లేషకులు మహావాది సుధీర్, విజయ్ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంది. గాయకులుగా వారు పాడిన హిందీ, తెలుగు భక్తి పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా ప్రముఖ గాయకుడు స్వర్గీయ కిషోర్ కుమార్ ఆలపించిన భక్తి పాటలు వీరు ఎంతో మధురంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండా శంకర్, అష్టదని గంగాధర్, రామడుగు మారుతి, మేడగోని రాజమౌళి గౌడ్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజం, నల్లగొండ శ్రీనివాస్, అవధానుల శ్రీనివాస్, రామడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Admin
E Nivas News