ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతోనే ఖానాపూర్ గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం ఖానాపూర్ గ్రామ పంచాయతి కార్యాలయ భవన నిర్మాణానికి సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరయ్యాయన్నారు. ఎల్ మడుగును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఖానాపూర్ పిడబ్ల్యు రోడ్ నుంచి రుద్ర పాదాల వరకు రూ.7కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు. భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ను మాజీ ఎంపిపి నారమల్ల లక్ష్మి రాజం, తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే నారమల్ల లక్ష్మి రాజం ను నాయకులు, గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచులు సేమంతుల ఓదెలు, దొరగోర్ల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు తోట సుధాకర్, నాయకులు బాస అశోక్, మంథని సమ్మయ్య, పెగడ రాజు, మాదర వెంకటేష్, రంగు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News