ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో ప్రతి ఒక్కరు నడిచి ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని ఉమ్మడి జిల్లాలోని అన్ని సంఘాల నాయకులు అన్నారు. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలతో పాటు చిత్రపాటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన బాల్యం నుండి ఎదుర్కొన్న సంఘటనలను ప్రతి ఒక్కరికి వివరించారు. అయినా మొక్కవోని ధైర్యంతో రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడని కొనియాడారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన దేశాన్ని కోసం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాలలో ఆయా సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News