ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థంగా నిర్మించిన అమరవీరుల స్తూపాన్ని కాంట్రా క్టర్లు, ఆర్.అండ్.బి. అధికారులు ధ్వంసం చేసి తొలగించడం సిగ్గుచేటని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఐత బాపు ఆగ్ర హంవ్యక్తంచేశారు. ఉద్యమ కాలంలో మహాముత్తారం మండలం యామన్ పల్లి చౌరస్తాలో 2013 లో నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని తొలగించడం హేయమైన చర్యా అని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన అమరవీరుల స్థూపాన్ని వెంటనే నిర్మించాలని పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ అధికారుల వహించాలని బాపు డిమాండ్ చేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మితమైన తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని కూల్చివేసిన అధికారులను సస్పెండ్ చేయాలని అలాగే కాంట్రాక్ట ర్ పై కేసు నమోదు చేసి కాంట్రాక్టు లైసెన్సులు రద్దు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీకా కిరణ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి లింగమల్ల సడవల్లి రావు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు రామగిరి రాజు, ప్రధాన కార్యదర్శి పుల్యాల సురే ష్,తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం మండల కార్యదర్శి కాసర్ల రాజ్ కుమార్, భానోత్ రాజు నాయక్, AIAYS కార్యవర్గ సభ్యులు పులియాల దుర్గేష్ జనగం రాజయ్య పాల్గొన్నారు.
Admin
E Nivas News