Thursday, 30 July 2026 09:43:59 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం...

Date : 18 June 2026 10:19 PM Views : 60

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ గురువారం మరో తియ్యటి కబురు అందించింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన ప్రతిష్టాత్మక "రైతు భరోసా" నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. నిధుల విడుదల అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రూ. 9,000 కోట్ల నిధులకు సీఎం ఆమోదం ప్రస్తుత వానాకాలం సాగు పెట్టుబడి నిమిత్తం ఏకంగా రూ. 9,000 కోట్ల భారీ బడ్జెట్‌ను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. 73 లక్షల మంది రైతులకు లబ్ధి: ఈ సరికొత్త నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు *73 లక్షల మంది రైతులకు* నేరుగా లబ్ధి చేకూరనుంది ఎకరానికి రూ. 6,000 ఆర్థిక సాయంగతంలో కంటే భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6,000 చొప్పునభారీ ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకోబోతోంది. పెట్టుబడి సాయంతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్, రైతు వేదికల ద్వారా సబ్సిడీ విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ చేపడుతూ వ్యవసాయ రంగాన్ని పండుగ చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి మధిర పర్యటన, బహిరంగ సభ విజయవంతం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు,ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :