ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో స్కూల్ గేమ్స్ అద్వర్యం లో ఈనెల 4న జరిగిన జోనల్ స్థాయి బాల, బాలికల రెజ్లింగ్ పోటీలలో ఇంధన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనభరిచి రాష్ట్ర స్థాయి కి ఎంపికైనట్లు పాఠశాల .ప్రధానోపాధ్యాయులు బి.రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్-14 విభాగం లో పి.సహస్ర 10 వ, పి.దివ్యా 9 వ, పి. రిషిత 8 వ, లు ప్రతిభ కనబరచగా అండర్ - 17 విభాగంలో టి. చందు, ఎస్. హర్షిత్, ఈ. సాయికుమార్ 10 పదవ తరగతి విద్యార్థులు కాగా, పి. అభిరామ్ 9 తరగతికి చెందిన విద్యార్థి ఎంపికైనట్లు తెలిపారు. వీరు త్వరలోజరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పిడి. శివనూరి తిరుపతి తెలిపారు. విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, ఏఏపిసి చైర్మన్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News