Friday, 17 April 2026 05:04:38 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

కూచ్ రాజ్ పల్లికి మహర్దశ..

కూచ్ రాజ్ పల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Date : 12 January 2026 01:41 PM Views : 260

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని కూచ్ రాజ్ పల్లికి మహర్దశ పట్టనుంది. కూచ్ రాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద రూ. 4.5 కోట్లతో నిర్మించబోతున్న ఆర్ అండ్ బి అతిథి గృహం, రూ. 60 లక్షలతో నిర్మించనున్న మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో నిర్మించనున్న కూచిరాజుపల్లి బస్టాండ్, రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఈద్గా నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాలతో కూచ్ రాజ్ పల్లి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ శంకు స్థాపన చేయడంతో నియోజకవర్గంలోని మున్నూరు కాపు సోదరులు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిపాలనాధికారి కోయ శ్రీహర్ష, ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు గంగదరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :