ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని కూచ్ రాజ్ పల్లికి మహర్దశ పట్టనుంది. కూచ్ రాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద రూ. 4.5 కోట్లతో నిర్మించబోతున్న ఆర్ అండ్ బి అతిథి గృహం, రూ. 60 లక్షలతో నిర్మించనున్న మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో నిర్మించనున్న కూచిరాజుపల్లి బస్టాండ్, రూ. 30 లక్షలతో నిర్మించనున్న ఈద్గా నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాలతో కూచ్ రాజ్ పల్లి పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్నూరు కాపు సంఘం కమ్యూనిటీ హాల్ శంకు స్థాపన చేయడంతో నియోజకవర్గంలోని మున్నూరు కాపు సోదరులు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిపాలనాధికారి కోయ శ్రీహర్ష, ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి మాజీ చైర్మన్ ఆకుల కిరణ్, నాయకులు గంగదరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News