Friday, 17 April 2026 05:04:38 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

బోథ్ మండల కేంద్రాన్ని మోడల్ గా తీర్చి దిద్దుతా

రూ. 10 కోట్లతో బోథ్ పట్టణ సుందరీకరణ

Date : 11 October 2025 08:01 PM Views : 182

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బోథ్ మండల కేంద్రాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోథ్ పట్టణంలోని కూడళ్లను, వీధులను నాయకులు, రోడ్లు భవనాలు శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాలనీల్లో గల బీడీ కార్మికులు, స్థానికులతో ఎమ్మెల్యే ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్ పట్టణాన్ని మోడల్ బోథ్ గా తీర్చిదిద్దుతామని, అందుకే నేడు పట్టణంలోని అన్ని కాలనిల్లో గల రోడ్లను స్వయంగా పరిశీలించడం జరిగిందని అన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి, పి ఆర్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రూ. 10 కోట్లతో త్వరలోనే రోడ్లు నిర్మిస్తామని, రూ. 18 కోట్లతో సెంటర్ లైటింగ్ తో సుందరికరణ కొరకు సైతం పాటుపడతామన్నారు. అన్ని కూడళ్ళ రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, రానున్న రోజుల్లో కచ్చితంగా మోడల్ బోథ్ గా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు. డిగ్రీ కాలేజి కొరకు సైతం ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం, ఫైర్ స్టేషన్ కొరకు సైతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు. ఎలక్షన్ల సమయంలోనే రాజకీయం, తర్వాత అభివృద్దే ద్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ డి ఈ అరవింద్, పి ఆర్ డి ఈ ధర్మేందర్, ఏ ఈ చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :