ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బోథ్ మండల కేంద్రాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా బోథ్ పట్టణంలోని కూడళ్లను, వీధులను నాయకులు, రోడ్లు భవనాలు శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. కాలనీల్లో గల బీడీ కార్మికులు, స్థానికులతో ఎమ్మెల్యే ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్ పట్టణాన్ని మోడల్ బోథ్ గా తీర్చిదిద్దుతామని, అందుకే నేడు పట్టణంలోని అన్ని కాలనిల్లో గల రోడ్లను స్వయంగా పరిశీలించడం జరిగిందని అన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి, పి ఆర్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రూ. 10 కోట్లతో త్వరలోనే రోడ్లు నిర్మిస్తామని, రూ. 18 కోట్లతో సెంటర్ లైటింగ్ తో సుందరికరణ కొరకు సైతం పాటుపడతామన్నారు. అన్ని కూడళ్ళ రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని, రానున్న రోజుల్లో కచ్చితంగా మోడల్ బోథ్ గా తీర్చుదిద్దుతామని స్పష్టం చేశారు. డిగ్రీ కాలేజి కొరకు సైతం ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం, ఫైర్ స్టేషన్ కొరకు సైతం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు. ఎలక్షన్ల సమయంలోనే రాజకీయం, తర్వాత అభివృద్దే ద్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ డి ఈ అరవింద్, పి ఆర్ డి ఈ ధర్మేందర్, ఏ ఈ చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News