Thursday, 30 July 2026 08:52:49 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

నియోజకవర్గంలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను త్వరగా పనులు పూర్తి చేయాలి...

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 10 March 2026 10:33 PM Views : 140

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చెన్నూర్ అసెంబ్లీ పరిధిలోని ఈద్గాహ్‌లు, మసీదులు మరియు ఖబ్రస్తాన్‌లలో శుభ్రత, పారిశుధ్య పనులు చేపట్టాలని కోరుతూ చెన్నూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇలియాజుద్దీన్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రివర్యులు మరియు చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ఈద్గాహ్‌లు, మసీదులు మరియు ఖబ్రస్తాన్‌లలో శుభ్రత, చెత్త తొలగింపు, పారిశుధ్య చర్యలు, తాగునీటి సౌకర్యం మరియు అవసరమైన ఇతర సదుపాయాలు కల్పించాలని మహమ్మద్ ఇలియాజుద్దీన్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు మరియు ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేస్తూ చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ఈద్గాహ్‌లు, మసీదులు మరియు ఖబ్రస్తాన్‌లలో అవసరమైన శుభ్రత మరియు పారిశుధ్య పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రంజాన్ మాసంలో ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు సూచించినట్లు తెలిపారు.ఇలా చేయడం వల్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెన్నూర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ఇలియాజుద్దీన్ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :