Friday, 31 July 2026 02:53:52 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ప్రజల వద్దకే సుపరిపాలన…/ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా దర్బార్...

మంత్రి ధనసరి అనసూయ సీతక్క

Date : 25 June 2026 11:55 PM Views : 51

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజల వద్దకే సుపరిపాలన అందించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి తన సరి అనసూయ సీతక్క తెలిపారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక *ప్రజా దర్బార్* కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండల పరిధిలోని అక్కినేపల్లి మల్లారం, బ్రాహ్మణపల్లి, రాజుపేట, కత్తిగూడెం, నిమ్మగూడెం, దోమెడ, రామచంద్రునిపేట, వాడేగూడెం,రమణక్కపేట, చుంచుపల్లి, వాగుడుగూడెం గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు తమ సమస్యలతో పాటు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల రూపంలో రూ.61 వేల కోట్లకు పైగా సహాయం అందించామని తెలిపారు. గతంలో మహిళా సంఘాలకు రూ.5 లక్షల వరకు మాత్రమే అందిన వడ్డీలేని రుణ పరిమితిని ప్రస్తుతం రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని, పాడి కేంద్రాలు, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళా సంఘాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ మహిళలు సంఘాలుగా ఏర్పడి కలిసి పనిచేస్తే కుటుంబాల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామాల వద్దకే పరిపాలనను తీసుకువెళ్లడం ప్రత్యేక ప్రజా దర్బార్ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రజలు అందించే ప్రతి దరఖాస్తును పరిశీలించి, వాటి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత క్రమంలో ఇండ్లను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ ప్రజలకు సులభంగా దరఖాస్తులు అందించే విధంగా ప్రత్యేక ఫార్మాట్ రూపొందించామని తెలిపారు. గ్రామాల వారీగా అందుతున్న దరఖాస్తుల ద్వారా స్థానిక సమస్యలపై స్పష్టమైన అవగాహన ఏర్పడి, పరిష్కార చర్యలు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు.ప్రతి దరఖాస్తును నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి, పరిష్కార స్థితిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తామని, సమస్య పరిష్కారం కాకపోతే కారణాలను కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేసే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరు నాగారం ఏ యస్ పి మనన్ భట్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి., సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పంచాయతీ రాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరు నాగారం ఏ యస్ పి మనన్ భట్, అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి., సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పంచాయతీ రాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: