Friday, 17 April 2026 05:03:40 PM
# మహిళలు పారిశ్రామి కవేత్త లుగాఎదగాలి # రానున్న మూడు రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశం.. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ... # రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ # తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ # మేటిగుడా గ్రామంలో షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ధైర్యంగా ఉండండి అండగా ఉంటా.. # యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి... # ఎండల్లో బయటకు రావొద్దు..! ప్రజలకు మంత్రి సీతక్క సూచన # అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి # విజయవంతంగా ముగిసిన చిన్న కాళేశ్వరం ఇరిగేషన్ భూసేకరణ # మంథని నియోజకవర్గ ప్రజలను అవమాన పరు స్తున్న పుట్టమధు వైఖరి మార్చుకోవాలి # సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను ఈ నెలా ఖరు లోగా పూర్తి చేయాలి # మద్దులపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం # పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలి # స్వేచ్ఛ సమానత్వానికి ప్రదీప్తి – 'డా. బి.ఆర్. అంబేద్కర్ # మృతుడి కుటుంబానికి ప్రమాద భీమా చెక్కు పంపిణీ # ప్రజాసేవనే తన ప్రాణం ఆయన జీవితమే అందరికి మార్గం.. # దోస్త్ నోటిఫికేషన్ విడుదల..

ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉద్యోగ ప్రకటన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలి

ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఆదివాసిలతో భర్తీ చేయాలి

Date : 20 November 2025 08:30 PM Views : 167

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు ఇటీవల ప్రాచూరిత్యం అయినా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఆదివాసులకు చాలా అన్యాయం జరిగిందని, శాన్వి సర్వీసెస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనను వెంటనే రద్దు చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ను ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ గురువారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల యందు ఉద్యోగ ప్రకటన చేసినటువంటి సాన్వి సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ, ఆదివాసులకు ఏ ఒక్క పోస్టు రిజర్వేషన్ కూడా కల్పించకుండా అన్నీ కూడా గిరిజనేతరులకు కేటాయించడం తో ఆదివాసీలకు చాలా అన్యాయం జరుగుతోందని, ఆదివాసి ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్న జిల్లా జల్ జంగల్ జమీన్ కోసం ఈ గడ్డలో పోరాడిన కొమురం భీం జిల్లాలో ఆదివాసులకు ఏ ఒక్క పోస్టును కూడ కేటాయించకుండా జిల్లాలో ఉద్యోగ ప్రకటన చేయడంఆదివాసి సమాజానికే చాలా అవమానకారం అన్నారు. వెంటనే ఈ ఉద్యోగ ప్రకటనను రద్దుచేసి ఆదివాసి నిరుద్యోగులు అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయవలసిందిగా కోరుతున్నామని కోరారు . ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావ్, ఆసిఫాబాద్ మండల తుడుందేబ్బ నాయకులు కొడప జగ్గేరావు, వాంకిడి మండల తుడుందేబ్బ నాయకులు సీడం భీంరావ్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :