ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు ఇటీవల ప్రాచూరిత్యం అయినా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఆదివాసులకు చాలా అన్యాయం జరిగిందని, శాన్వి సర్వీసెస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో ఇటీవల విడుదలైన ఉద్యోగ ప్రకటనను వెంటనే రద్దు చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ను ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ గురువారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల యందు ఉద్యోగ ప్రకటన చేసినటువంటి సాన్వి సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ, ఆదివాసులకు ఏ ఒక్క పోస్టు రిజర్వేషన్ కూడా కల్పించకుండా అన్నీ కూడా గిరిజనేతరులకు కేటాయించడం తో ఆదివాసీలకు చాలా అన్యాయం జరుగుతోందని, ఆదివాసి ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్న జిల్లా జల్ జంగల్ జమీన్ కోసం ఈ గడ్డలో పోరాడిన కొమురం భీం జిల్లాలో ఆదివాసులకు ఏ ఒక్క పోస్టును కూడ కేటాయించకుండా జిల్లాలో ఉద్యోగ ప్రకటన చేయడంఆదివాసి సమాజానికే చాలా అవమానకారం అన్నారు. వెంటనే ఈ ఉద్యోగ ప్రకటనను రద్దుచేసి ఆదివాసి నిరుద్యోగులు అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయవలసిందిగా కోరుతున్నామని కోరారు . ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జిల్లా ఉపాధ్యక్షులు మడపచి భీంరావ్, ఆసిఫాబాద్ మండల తుడుందేబ్బ నాయకులు కొడప జగ్గేరావు, వాంకిడి మండల తుడుందేబ్బ నాయకులు సీడం భీంరావ్ పాల్గొన్నారు.
Admin
E Nivas News