ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఆయా ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అలాగే పలు పార్టీల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులను, నాయకురాళ్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశంలో మహిళలే ఎక్కువగా అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. ప్రభుత్వాలు సైతం మహిళలకే అన్ని రంగాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మహిళలు కూడా పురుషులకు తీసుకోకుండా అన్ని రంగాల్లో కొలువులు పొందారన్నారు. ఈ పోటీ ప్రపంచంలో విద్యారంగుల సు విద్యారంగంలో సైతం బాలుర కన్నా బాలికలే ఎక్కువగా విద్యపై మక్కువ చూపిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో సైతం ఎక్కడ చూసినా వారు కూడా పురుషులతో సమానంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం కష్టపడి పలు కొలువులు సాధించిన మహిళలను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాలల్లో కేకులు కట్ చేసి పంచిపెట్టారు.
Admin
E Nivas News