ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సీఎం కప్ పోటీల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన జిపి మరియు మండల స్థాయి టౌర్నమెంట్ కార్యక్రమానికి శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. విద్యార్థులు ఘన స్వాగతం స్వీకరించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూక్రీడల్లో ఎంత ఉత్సాహంతో పాల్గొని అంతా ఎత్తుకు ఏదుగుతారని, తాను సైతం క్రీడల్లో రాణించి పిఈటీ టీచర్ గా అయ్యాయని అన్నారు. గిరిజన విద్యార్థులు ఎక్కువగా క్రీడల్లో రాణించాలని అన్నారు. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ సర్పంచ్ రమణ, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, సర్పంచులు శ్రీకాంత్, జ్యోతి, లక్ష్మీ, సుధాకర్, అమృత్, మహేందర్ రెడ్డి, కృష్ణ, విజయ్తో పాటు నాయకులు ప్రతాప్, ఫయాజ్, సరిచంద్, అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News