ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ల సత్యనా రాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో పలు కీలక శాఖల్లో గిరిజన జాతి అధికారులు సేవలందించడం గర్వకారణమని పేర్కొన్నారు. జాతికి సేవ చేయడం ప్రతి ఒక్కరికి దక్కే అదృష్టమని అన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు 2.కోట్ల వ్యయంతో సంత్ సే వాలాల్ మహరాజ్ బంజా రాభవనం మంజూరు చేసినట్లు తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూ ర్తి చేయుటకు చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గిరిజన సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఆ రోజుల్లోనే బంజా రా జాతికి విద్యా,విజ్ఞాన పరంగా దిశానిర్దేశం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని కొని యాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసు కొని సమగ్ర అభివృద్ధి సాధించాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, ఆర్డిఓ హరి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గిరిజన సంక్షేమ అధికారి నాగ సాగ ర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు దేవన్, కౌన్సిలర్లు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News