ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / : కురవి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు లో నేటి నుండి 18 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అండర్ 14 బాలికల కబడ్డీ విభాగంలో నేరెడ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థిని బి జోష్ణ ఎంపికైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న ములుగు జిల్లా జాకారం గురుకుల పాఠశాలలో నిర్వహించిన 69వ ఎఫ్ జి ఎఫ్ ఎల్ అండర్ 14 బాలికల కబడ్డీ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన జోష్ణను ప్రిన్సిపాల్ తో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఐ సురేష్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు సిబ్బంది అభినందించారు.
Admin
E Nivas News