Friday, 31 July 2026 05:32:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

Date : 28 July 2026 09:54 PM Views : 42

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రాష్ట్ర న్యాయ సేవాధి కార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలంలోని, సంజీవనగర్ తాండ నందు జులై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జడ్జి మాట్లాడుతు ప్రకృతి ని పర్యావరనాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు. మానవ వన్య ప్రాణి దాడుల బాధితులకు న్యాయం పొందేందుకు సంబంధించిన జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ పథకం 2025 అమలు పై తో అటవీ సరిహద్దు ప్రాంతాలలో వ్యవసాయ పొలాలలో చిరుతలు, పులులు, ఏనుగులు, అడవి పందుల దాడుల వలన ప్రాణాలు కోల్పోయిన మరియు పశువులను, పంటలను కోల్పోయిన వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు గవర్నమెంట్ నుండి నష్టపరిహారం లభిస్తుందని తెలిపారు. గిరిజనులకు ఏవైనా సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 పై కాల్ చేస్తే వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని తెలిపారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామ చంద్రరావు మాట్లడుతూ అడవి జంతువుల బాధితులకు పరిహారం అందించేందుకు అటవీశాఖ అధికారులు మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. ఐటీడిఐ ప్రాజెక్ట్ ఆఫీసర్ గుండాల నాయక్ మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2026 లో ప్రాజెక్ట్ హనుమాన్ను ప్రారంభించి వన్యప్రాణుల దాడుల బాధితులకు తక్షణ వైద్య సహాయం మరియు వేగవంతమైన నష్ట పరిహారాలను అందిస్తుందని తెలిపారు. ఆత్మకూరు డియస్పి ఆర్.రామాంజి నాయక్ మాట్లడుతూ గిరిజనులు అటవీ భూములను కాపాడుకోవాలని చెట్లను కొట్టి వేయకుండా ప్రకృతి ని కాపాడాలని కోరారు. అనంతరం గిరిజనులకు నంద్యాల డిస్టిక్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్, ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మి కుమారి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జాకిర్ హుస్సేన్ , ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ గుండాల నాయక్, ఆత్మకూరు ఎంపీడీవో నాగేంద్రుడు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆత్మకూరు న్యాయ వాదులు భాస్కర్, బతుకులయ్య, అంకిరాజు, ప్యారా లీగల్ వాలెంటీర్స్ రమేష్, బలరాముడు, రాబిన్ సన్ రాజు, జుల్ఫికర్, యస్.యన్.తాండ సర్పంచ్ నాగులు నాయక్, డాక్టర్ పవన్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మరియు ఐటీడిఐ అధికారులు, జిల్లా రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :